1.అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
అమరావతి రైతులు మహా పాదయాత్ర చేపట్టేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.
2.కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి ఖరారు
కాంగ్రెస్ పార్టీ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ని ఎంపిక చేసింది.
3.గవర్నర్ ను రీ కాల్ చేయాలి
సంబంధం లేని వాటిలో తెలంగాణ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని , వెంటనే గవర్నర్ గా ఆమెను రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
4.బండి సంజయ్ కామెంట్స్
తెలంగాణ గవర్నర్ తమిళ సై పై ఏపీ ముద్ర వేసి అవమానిస్తున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్ చేశారు.
5.మూడో రోజు భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ అధినేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది.
6.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.ఏపీలో భారీ వర్షాలు
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పిడుగులు పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు.
8.నూకల ఎగుమతిపై నిషేధం విధించిన భారత్
నూకల ఎగుమతి పై భారత్ తక్షణ నిషేధం విధించింది.
7 తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిసింది.
8.హుస్సేన్ సాగర్ వద్ద భారీ ఏర్పాట్లు
ఈరోజు గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వద్ద అధికారులు భారీగా ఏర్పాటు చేశారు.అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
9.మద్యం షాపుల బంద్
హైదరాబాద్ , సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈరోజు రేపు మద్యం షాపుల మూసే ఉంటాయని అధికారులు తెలిపారు.
10.నేడు తెలంగాణకు అసోం సీఎం
నేడు తెలంగాణకు అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు .
11.తిరుమల సమాచారం
ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో అనంత పద్మనాభ్రతం సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
12. సౌత్ జూన్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు
నేటి నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 33 సౌత్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి.దీంట్లో 910 మంది క్రీడాకారులు పాల్గొంటారు.
13.మెగా జాబ్ మేళా
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు డోన్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
14.రాష్ట్రస్థాయి వృషభాల బండ లాగుడు పోటీలు
కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పుట్లూరులో శ్రీమాతా మారెమ్మ బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు రాష్ట్రస్థాయి వృషభాల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు.
15.వెంకయ్య నాయుడు పర్యటన
నేడు గుంటూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు.గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొంటారు.
16.జగన్ సమీక్ష
వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
17.లోకేష్ పై పేర్ని నాని కామెంట్స్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ చేశారు. లోకేష్ కోసం ఐదుగురు మంత్రులను పీకేసారు అంటూ నాని కామెంట్ చేశారు.
18.ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర భారీ జనసందోహం మధ్య ప్రారంభమైంది .
19.హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పొడగింపు
జంట నగరాల్లో మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైల్ ట్రిప్పులు సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,510 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,780
.