మచ్చలు, ముడతలు.అత్యధికంగా వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో ఈ రెండూ ముందు వరసలో ఉంటాయి అనడంలో సందేహమే లేదు.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, కాలుష్యం, స్కిన్ కేర్ లేక పోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రోడెక్ట్స్ను వాడటం, స్మోకింగ్ అలవాటు ఇలా రకరకాల కారణాల వల్ల మచ్చలు, ముడతలు ఏర్పడి ముఖ సౌందర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.దాంతో ఏం చేయాలో తెలియక, ఈ సమస్యలను ఎలా నివారించుకోవాలో అర్థం గాక తెగ మదన పడిపోతూ ఉంటారు.
అయితే ఇకపై చింతించాల్సిన అవసరం లేదు.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్యాక్ను ట్రై చేస్తే ఎటువంటి మచ్చలైనా, ముడతలైనా ఇట్టే తగ్గి పోతాయి.
మరి ఆ ఎఫెక్టివ్ ప్యాక్ ఏంటీ.? దానిని ఎలా తయారు చేసుకోవాలి.? అన్న విషయాలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బాగా పండిన అరటి పండును తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి.ఇప్పుడు ఇందుకు నాన బెట్టి తొక్క తీసిన బాదం పప్పు ఆరు, ఎండు ద్రాక్షాలు ఎనిమిది, అర కప్పు పచ్చి పాలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ పేస్ట్లో అర స్పూన్ కస్తూరి పసుపు, అర స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
అనంతరం వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని.అప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి.ఇరవై నిమిషాలు అయిన తర్వాత మెల్ల మెల్లగా రుద్దుకుంటూ కూల్ వాటర్తో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే.
కేవలం కొద్ది రోజుల్లోనే మచ్చలు, ముడతలు పరారై ముఖం అందంగా, మృదువుగా తయారువుతుంది.మరియు ఈ ప్యాక్ వల్ల డార్క్ స్కిన్ వైట్గా కూడా మారుతుంది.