1.ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్
ఇండియన్ ఎంబసీ ఆధ్యర్యంలో రేపు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.
2.కెనడాలో కాల్పుల కలకలం .పలువురి మృతి

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని లాంగ్లి నగరం లో సోమవారం కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనలో వీధుల్లో నివసిస్తున్న అనేక మంది నిరాశ్రయులపై కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారు.
3.యూకే ప్రధాని అభ్యర్థి పై చైనా ఆగ్రహం
యూకే ప్రధాని అభ్యర్థి రుషి సునక్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.చైనా పై రుషి సునక్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవి అంటూ మండిపడింది.
4.పాక్ చైనా లకు ఇండియా వార్నింగ్
పాక్ చైనా లకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా వెళ్తున్న చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ గుండా వెళ్తున్న చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
5.హిందువులు, సిక్కులకు తాలిబన్లు పిలుపు

హిందువులు సిక్కులు తిరిగి వెనక్కి రావాలని తాలిబాన్ ప్రభుత్వం పిలుపు ఇచ్చింది.
6.ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గా భారతీయుడు

ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గా డెవలప్మెంట్ ఎకనామిక్స్ వైస్ ప్రెసిడెంట్ గా భారత సంతతి ఆర్థికవేత్త ఇందిరా మిత్ నియమితులయ్యారు.
7.ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొడతాం : రష్యా
ఉక్రెయిన్ లోని జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే రష్యా లక్ష్యం అని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావ్రొవ్ అన్నారు.
8.మయన్మార్ లో నలుగురు నేతలకు ఉరి

మయన్మార్ లోని సైనిక ప్రభుత్వం నలుగురు అంగసాన్ సూకీ పార్టీకి చెందిన నేతలకు ఉరి శిక్ష విధించింది.ఈ విషయాన్ని సైనిక ప్రభుత్వం నిర్ధారించినా జైళ్ల శాఖ నిర్ధారించ లేదు.