గోల్ గుంబజ్. ఇది బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా సమాధి.
ఇది కర్ణాటకలోని బీజాపూర్లో ఉంది.దీని అర్థం వృత్తాకార గోపురం.44 మీటర్ల వ్యాసంతో ఇది భారతదేశంలోని అతిపెద్ద గోపురాలలో ఒకటి.దీని నిర్మాణం 1656లో జరిగింది.
దీని వాస్తుశిల్పి యాకుత్ ఆఫ్ దాబుల్.ఈ గోపురానికున్న అద్భుతమైన లక్షణం ఏమిటంటే.
ఇది స్తంభాల మద్దతు లేకుండా నిలిచివుంది.ఈ గోపురంలో ముహమ్మద్ ఆదిల్ షా, అతని ఇద్దరు భార్యలు, అతని కుమార్తె, మనవడి సమాధులు ఉన్నాయి.
ఈ అందమైన భారీ గోపురం వైశాల్యం సుమారు 18 వేల 337 చదరపు అడుగులు.ఎత్తు దాదాపు 175 అడుగులు.
ఈ గోపురం లోపలి భాగాన్ని చూసినవారంతా ఆశ్చర్యపోతుంటారు.గుండ్రని గోపురం లోపల నుండి పూర్తిగా బోలుగా ఉంటుంది.సైన్స్ కూడా ఇంతవరకు ఈ రహస్యాన్ని బట్టబయలు చేయలేకపోయింది.ఈ గోపురం రోమ్లోని పాంథియోన్లోని సెయింట్ పీటర్-సర్కిల్ గోపురం కంటే కొంచెం చిన్నది ఈ గోపురంలో గ్యాలరీని కూడా ఉంది.
ఈ గ్యాలరీలో ధ్వని 7 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఈ ధ్వని ఒక వైపు నుండి మరొక వైపునకు చాలా స్పష్టంగా వినిపించే విధంగా వాస్తుశిల్పి యాకుత్ ఈ భారీ గోపురం నిర్మించారు.
![Telugu Bijapur, Gol Gumbaz, Ibrahim Shahi, Karnataka, Mohammadadi, Yakut Dabul-L Telugu Bijapur, Gol Gumbaz, Ibrahim Shahi, Karnataka, Mohammadadi, Yakut Dabul-L](https://telugustop.com/wp-content/uploads/2022/03/what-makes-the-gol-gumbaz-astonishing-detailss.jpg )
ఆదిల్ షా వంశానికి చెందిన ఆదిల్ షా తండ్రి ఇబ్రహీం షాహీ మరణానంతరం దక్కనులో మొత్తంలో మరే ఇతర భవనం లేని విధంగా అద్భుతమైన భవనం నిర్మించాలని మహమ్మద్ ఆదిల్షా భావించారు.ఈ భవనాన్ని నిర్మించేందుకు 20 సంవత్సరాలు పట్టిందని చెబుతారు.ఈ గోపురం నాలుగు మినార్లను కలిగి ఉంది ప్రతి టవర్ 7 అంతస్తులను కలిగివుంది.ఈ భవనంలో పెద్ద కిటికీలు కూడా కనిపిస్తాయి.ఈ కిటికీల నుండి సూర్యకాంతి లోనికి చేరుతుంది.గోపురం వరకు వెళ్ళడానికి 8 తలుపులు కనపిస్తాయి.
ఈ తలుపుల ప్రత్యేకత ఏమిటంటే ప్రతి తలుపు టేకు చెక్కతో తయారు చేశారు.