ఏపీ సీఎం జగన్ అధికారంలోకొచ్చి నెల రోజులు పూర్తి చేశారు.అయినా ఇంకా ఏం చేయలేదు.6నెలల పాలన పూర్తైంది.అయినా అభివృద్ధి కానరవట్లేదు.
ఇప్పటికే రెండేండ్లు కావస్తోంది ఇంకా జగన్ ఏం ఎలగబెట్టలేకపోతున్నారు.ప్రస్తుతం మూండేండ్లు అవుతోంది అయినా… అభివృద్ధి ధ్యాసే లేదు… అంటూ నిరంతరం వైసీపీని, జగన్ను విమర్శించే పార్టీ అంటూ ఉందంటే అది టీడీపీనే.
సీఎంగా జగన్ కుర్చీ ఎక్కిన నాటి నుంచి ఇదే నాదం వినిపిస్తూ వస్తున్నారు.అయితే జగన్ పాలన ఎన్ని రోజులవుతోంది అంటే అందరూ చెప్పేస్తారు.
చివరికి రాజకీయ అనుభవం లేని వారు కూడా ఠకీమని చెబుతారు.మరీ అంతలా టీడీపీ తమ్ముళ్లు పనికట్టుకుని జగన్ అధికారం పై విరుచుకుపడుతున్నారు.
పాలన ఐదేండ్లు కాబట్టి ఎవరైనా జగన్ ఇంకా అధికారం చేపట్టేది ఎన్ని రోజులంటే రెండేండ్లు అని ఠకీమని చెబుతారు.
కానీ, టీడీపీ మాత్రం అంత సమయం లేదంటోంది.2024 ఎన్నికల ప్రకారం ఇంకా రెండేండ్లు మాత్రమే అని అంచనా వేస్తాం.అయినా అంత సమయం లేదని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు.
జగన్ ఇంకా నికరంగా ఉండేది ఇంకా 12నెలలు మాత్రమే అని పేర్కొంటున్నారు.ఏపీకి తానే శాశ్వతంగా ఏలికగా ఉంటానని ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఆయనకు అంత సీన్ లేదని విమర్శిస్తున్నారు.
నిజాలు చెప్పే విపక్షలపై కేసులు బనాయిస్తూ ఇబ్బంది పెట్టడం తప్ప వేరేదేదీ లేదని మండిపడ్డారు.జగన్ ఏడాది పాలన మాత్రమే ఉందని తెలుసుకోవాలంటూ హితవు పలికారు.2023 మే తరువాత ఏడాది ఉన్నా ఆ తరువాత ఏ అధికారి కూడా జగన్ మాట వినరని, పోలీసులు సైతం పట్టించుకోరని జోస్యం చెప్పారు.
జగన్ పాలన ఉన్ని కొన్ని రోజుల్లో మంచి పనులు చేసి నిబద్ధత చాటుకోవాలని సూచించారు.తన ఇంటిపై కి పోలీసులొచ్చి అరెస్టు చేయాలని అనుకోవడం టైమ్ వేస్టే నని చెప్పడం గమనార్హం.ఇవన్నీ మానుకుని విశాఖ ఏజెన్సీలో అక్రమ మైనింగ్పై, రంగురాళ్ల దందాపై పోలీసులు ప్రతాపం చూపాలని అన్నారు.
దీనికి సంబంధించిన వివరాలు లేకుంటే తాను ఇస్తానని సూచించారు.పోలీసులను అడ్డంపెట్టుకుని జగన్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
అధికారం త్వరలోనే పోతుందని, ఆ విషయాన్ని జగన్ గుర్తెరగాలని హితవు పలికారు.ఏది ఏమైనా జగన్ పాలన ఇంకా ఏడాది మాత్రమే అంటూ మరీ లెక్కలు కట్టి చెబుతున్న టీడీపీకి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.