అన్నము పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.ప్రపంచవ్యాప్తంగా చాలామంది సమయానికి అన్నము దొరకగా ఏదో ఒకటి తిని బ్రతికేస్తున్నారు.
మరికొంతమంది ఆకలి బాధతో చనిపోతున్నారు.మనదేశంలో మాత్రం చాలా మంది ఇంట్లో వండిన ఆహారాన్ని బాక్స్ లో తీసుకొని ఆఫీసులకు వెళుతూ ఉంటారు.
ఇటువంటి వారికి బైటి ఆహారం అస్సలు నచ్చదు.వీరు మధ్యాహ్నం పూట తమ ఇంటి నుండి తెచ్చుకున్న బాక్స్ లో ఉన్న ఆహారాన్ని మాత్రమే తింటారు.
కానీ కొన్ని సందర్భాల్లో ఇటువంటి వారు కూడా బయటి ఆహారాన్ని తినవలసి వస్తుంది.ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు వీరు కూడా బయటి ఆహారంపై ఆధారపడి వస్తుంది.
కాలేజ్ స్టూడెంట్స్, దూర ప్రయాణాలు చేసేవారు, ఎక్కువగా బయట ఆహారాన్ని తింటూ ఉంటారు.మరి ఎక్కువ గా వ్యాపారస్తులు కూడా బయటి ఆహారాన్ని ఎక్కువ గా తీసుకుంటారు.
ఎందుకంటే వీరు వ్యాపారం చేసుకుంటూ కస్టమర్లు తక్కువగా ఉన్న సమయంలో ఏదో ఒక బయటి ఆహారాన్ని తింటూ ఉంటారు.ఇలా బయట ఆహారం తినడం వల్ల వారి ఆరోగ్యాలపై చాలా చెడు ప్రభావం ఉంటుంది.
ముఖ్యంగా మధ్యాహ్నం ఆకలిగా ఉన్నప్పుడు బయటి ఆహారాన్ని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.
ఆ సమయంలో ఎక్కువగా సమోసా, బజ్జీలు, చికెన్ బజ్జీలు, నూడుల్స్ లాంటివి తింటుంటారు.అయితే ఇలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఇలాంటి ఆహార పదార్థాలను వాడిన నూనెలో వేయించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇలాంటి బయటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.లేదంటే గ్యాస్టిక్, కడుపునొప్పి ఒంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు.