తాటిపూడి పైప్ లైన్ పై దుకాణాలు ఉండడంతో లీక్ అయిందని కాలనీవాసులు ఆందోళన.తడిసి ముద్దైన వుడా కాలనీ.
ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు తడిసి పోయాయి అంటూ ఆందోళన.దుకాణాల యజ మానులకు రాజకీయ నాయకులు అండ ఉండడం తోనే, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తాటిపూడి పైప్ లైన్ ఒక్కసారి లీక్ కావడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీలో నీరు ఇళ్లల్లోకి చేరింది…అర్ధరాత్రి తాటిపూడి పైప్ లైన్ లీక్ కావడంతో విశాఖ నగరం లోకి వెళ్ళవలసిన నీరు వృధాగా పోతుందని జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని స్థానికులు వాపోతున్నారు…