ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు మీడియా ఉంది అని మర్చిపోయి హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా జనాలు త్రాగడం మానివేయడం లేదు.
సెలబ్రిటీలకు సైతం జనాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదనిపిస్తోంది.అందుకు ఉదాహరణగా పొగాకు, గుట్కా,మద్యం లాంటి బ్రాండ్స్ కు సెలబ్రిటీ లు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తు.
జనాలని ఇంకా చెడగొడుతున్నారు.ఇటీవలే అమితాబచ్చన్ పొగాకు ఉత్పత్తుల నుంచి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.
అలాగే రెజీనా కూడా ఒక విక్కీ బ్రాండ్ సిగ్నేచర్ ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ చేసింది.ఈ విషయంపై నెటిజన్లు ఆమెపై పెద్ద ఎత్తున మండిపడ్డారు.సెలబ్రిటీలు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఇక తాజాగా వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఇదే దారిలో నడిచింది.
తన భర్త గౌతమ్ తో కలిసి పేకాట ఆడుతున్నట్టుగా, మందు కొడుతున్నట్టుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది.
అందులో టీచర్స్ బ్రాండ్ కు సంబంధించిన మందు బాటిల్ ఉంది.ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు కాజల్ అగర్వాల్ పై రోలింగ్ చేస్తున్నారు. ఈ పండుగను టీచర్ స్మూత్ లిక్విడ్ తో సెలబ్రేట్ చేసుకోండి.
ఇదే పర్ఫెక్ట్ కాంబినేషన్.ఈ విస్కీ బ్రాండ్ ము అంబాసిడర్ గా మారినందుకు నాకు కిచ్లుకి ఎంతో ఆనందంగా ఉంది.
బాధ్యతగా తాగండి.ఈ పోస్ట్ కేవలం పాతికేళ్లు నిండిన వారికే అని చెప్పుకొచ్చింది కాజల్.
ఈ విషయంపై నెటిజన్లు పండుగకు ఇలా తాగమని ఎంకరేజ్ చేస్తావా? మీకు ఏమైనా డబ్బులు తక్కువగా ఉన్నాయా ఇలాంటి యాడ్ లు కూడా చేస్తున్నావ్? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేయడమే కాకుండా ఛీ.ఛీ అంటూ అసహ్యించుకుంటున్నారు.