తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 శరవేగంగా దూసుకు పోతుంది.ప్రతి సీజన్ ల్లో కూడా కొందరు కంటెస్టెంట్స్ కు అభిమానులు ఏర్పడుతారు.
ఆ అభిమానులు హోస్ట్ ను ఖచ్చితంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉంటాం.తమ అభిమాన కంటెస్టెంట్స్ ను సమర్థించకున్నా పర్వాలేదు కాని విమర్శించేలా హోస్ట్ మాట్లాడితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెడతారు.
పెద్ద ఎత్తున నాగార్జునను ఇప్పుడు సన్నీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.ఒక సింపుల్ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టిన సన్నీ ఇప్పుడు పెద్ద స్టార్ గా మారాడు.
ఖచ్చితంగా టాప్ 2 లేదా 3 లో ఉంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.అంతే కాకుండా ట్రోఫీని నెగ్గే సత్తా అర్హత కూడా సన్నీకి ఉందంటూ అభిమానులు బలంగా చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో కూడా సన్నీ ఇదే ఆట తీరును ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా సన్నీకి ప్రముఖ స్థానం దక్కుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ లో షన్నూ వంటి వారు ఏం ఎఫర్ట్ పెట్టకుండా లేజీగా ఉంటున్నారు.వారిని వదిలేసి సన్నీని టార్గెట్ చేసి విమర్శించడం ఏంటీ అంటూ నాగార్జునను కొందరు టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో నాగార్జునకు వ్యతిరేకంగా పెద్ద ట్రెండ్ నడుస్తోంది.
అందుకు కారణం శనివారం ఎపిసోడ్ లో సన్నీని నాగార్జున తీవ్రంగా కోప్పడ్డాడు.సన్నీ ఫొటోను చించేసి తెగ మాటలు అనేశాడు.
సన్నీపైకి వెళ్లిన శ్రీరామ్ చంద్ర మరియు ఇతరులను మాత్రం ఏమాత్రం మందలించలేదు కదా కనీసం ఆ విషయం పై వారిని అడిగిందే లేదు.అలా సన్నీ విషయంలో నాగార్జున చేసింది తప్పు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున మందలించడం వల్ల సన్నీ మరింత స్ట్రాంగ్ అవుతున్నాడు తప్ప వీక్ అవ్వలేదు అనేది కొందరి అభిప్రాయం.మొత్తానికి ఈ వారం సన్నీ కి మరింత సపోర్ట్ లభించింది.
బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచేందుకు సన్నీ మరో అడుగు వేసేలా నాగార్జున స్వయంగా ఆయన ఫొటోను చించి వేశారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.