బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 26 వ డివిజన్ వీరా రెడ్డి నగర్ స్మశానవాటికలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దలు మరియు ఇతర పార్టీ లీడర్లు కార్పొరేటర్లు వివిధ కులాలకు చెందిన కుల పెద్దలు పాల్గొని వీరా రెడ్డి నగర్ లోని స్మశాన వాటిక సుమారు 60 సంవత్సరాలుగా ఉందని తమ కుటుంబ సభ్యుల సమాధులు అందులోనే ఉన్నాయని గతంలో స్మశాన వాటిక చుట్టూ గ్రామ పంచాయతీ నిధులతో ప్రహరి గోడ నిర్మించగా ఇప్పుడు కాలనీ లోని కొందరు పార్క్ స్థలమని ప్రహరీ గోడను కూల్చి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తమ కుటుంబ సభ్యుల సమాధులను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కార్పొరేటర్లు మరియు ఇతర కుల సంఘాల పెద్దలు అన్నారు.
తాజా వార్తలు