సాధారణంగా కొందరికి ముఖం మొత్తం మొటిమలు మచ్చలు( Acne scars ) ఏర్పడుతుంటాయి.ఇవి చాలా అసహ్యం కనిపిస్తాయి.
అద్దంలో ముఖాన్ని చూసుకున్న ప్రతిసారి మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి.ఈ క్రమంలోనే మొటిమలను, మచ్చలు వదిలించుకునేందుకు రకరకాల క్రీములు, సీరమ్లు వాడుతుంటారు.
క్లియర్ స్కిన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ ( Green tea powder )మరియు చిన్న కప్పు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్,( Neem powder ) పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు సరిపడా గ్రీన్ టీ వేసుకుని బాగా మిక్స్ చేసి పోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఎంతటి మొండి మొటిమలు ఉన్నా పరార్ అవుతాయి.
అలాగే మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.ముఖ చర్మం తెల్లగా మృదువుగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.

అంతేకాదు ఓట్స్, నీమ్ పౌడర్, గ్రీన్ టీ మరియు పసుపులో ఉండే పలు సుగుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.ఏజింగ్ ను ఆలస్యం చేస్తాయి.కాబట్టి మొటిమలు మచ్చలు లేని తెల్లటి మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.







