పెళ్లితో ఒక్కటయ్యారు.ఆ తర్వాత హనీమూన్ వెళ్లాలని నిశ్చయించుకుని వాళ్లకు నచ్చిన ప్లేస్ కు హనీమూన్ కోసం బయల్దేరారు.
కానీ వారి కళలపై కరోనా నీళ్లు చల్లింది.ఎంతో ఆనందంగా బయల్దేరిన ఆ కొత్త జంటకు చేదు అనుభవం ఎదురైంది.
కరోనా కారణంగా వాళ్ళ హనీమూన్ ఆగిపోవడమే కాకుండా అక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారంటూ కొత్త జంట వాపోతున్నారు.
ఇంతకీ ఏం జరిగింది.? ఎందుకు వాళ్ళ హనీమూన్ ఆగిపోయింది.అసలు మధ్యలో కరోనా ఎందుకు వచ్చింది.
వాళ్ళు ఏం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అని తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.పశ్చిమ లండన్ లోని కిస్విక్ ప్రాంతానికి చెందిన అమీ, అల్బెర్టో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.పెళ్లి జరిగిన తర్వాత మూడు రోజులకు హనీమూన్ కోసమని బార్బడోస్ బయల్దేరి వెళ్లారు.
వెళ్లే ముందు కొన్ని పరీక్షలు చేయించుకున్నారు.ఆ పరీక్షల్లో ఇద్దరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో హనీమూన్ కోసం బయల్దేరారు.
బార్బడోస్ వెళ్లిన తర్వాత ఎయిర్ పోర్ట్ లో మళ్ళీ సిబ్బంది కరోనా పరీక్షలు చేసారు.
అయితే అక్కడ మాత్రం వధువుకు కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో అక్కడే క్వారంటైన్ కు ఆమెను పంపారు.అయితే అక్కడ వసతులు బాలేదని ఆమెను వరుడు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాడు.
కానీ అక్కడ వారికీ చాలా ఖర్చు అయ్యిందని కొత్త జంట వాపోతున్నారు.అలా పాపం వారు హనీమూన్ కోసమని వచ్చి బార్బడోస్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కరోనా రావడంతో వాళ్ళ హనీమూన్ జరగలేదు సరికదా ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యింది.తమ జీవితంలో ఎంతో మధురమైన రోజుగా గుర్తు పెట్టుకోవాల్సిన హనీమూన్ ను వాళ్ళకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ప్రస్తుతం వారిద్దరూ ఐసోలేషన్ పూర్తి చేసుకుని స్వస్థలానికి చేరుకున్నారు.చూసారు కదా మొత్తానికి కరోనా కొత్త జంటను ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో.