తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ తదితర చిత్రాలలో హీరోయిన్గా నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగమ్మాయి సమీరా రెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తన సినీ కెరీర్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలు పెట్టినప్పటికీ ఎక్కువగా హిందీ తమిళం తదితర భాషలలో సినిమా అవకాశాలు రావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ని పక్కన పెట్టింది బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి నీ ప్రేమించి పెళ్లి చేసుకొని బాలీవుడ్ లో సెటిల్ అయింది కాగా ప్రస్తుతం నటి సమీరా రెడ్డికి ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు.
దీంతో నటి సమీరా రెడ్డి తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడటంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది.
అయితే ఈ మధ్య కాలంలో నటి సమీరా రెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.
ఈ క్రమంలో తన అభిమానులు ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది.అయితే తాజాగా ఓం ఎడిషన్ 42 ఏళ్ల వయసులో బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని చాలా మంది నటీనటులకు నేచురల్ బ్లాక్ హెయిర్ ఉందని కానీ మీకు మాత్రం అతి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం తనకు ఆశ్చర్యం వేసిందని పోస్ట్ చేసింది.
దీంతో సమీరా రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ ఇందులో భాగంగా ఈ విషయం గురించి తాను బహిరంగంగా మాట్లాడుతున్నానని అయితే చాలా మంది మహిళలు తమకు తెల్లని వెంట్రుకలు ఉన్నాయనే ఈ విషయాన్ని కప్పిపుచ్చుతుంటారని కానీ తాను మాత్రం ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నట్లు తెలిపింది.అలాగే ఇది ఆరోగ్యకరమైన సంభాషణల సమయం” అంటూ రిప్లై ఇచ్చింది.
అయితే పెళ్లయిన తర్వాత నటి సమీరా రెడ్డి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినా ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగర పరిసర ప్రాంతంలో నివాసం ఉన్నట్లు సమాచారం.కాగా ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు అవకాశం వచ్చినప్పటికీ తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మరియు తనకు ప్రస్తుతం నటనపై ఆసక్తి లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.కానీ ఈ విషయంపై నటి సమీరా రెడ్డి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.