తెలంగాణలో ఎన్నికల జోరు ఇంకా ఆగిపోలేదు.ఒకవైపు సాగర్ ఎన్నికలు పూర్తవనికి వస్తున్న నేపధ్యం లో తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్దం అవుతుంది.
ఈ క్రమంలో ఈనెల 30న ఈ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం 43 వార్డులకు గాను ఆరుగురు అభ్యర్థులతో కూడిన టీఆర్ఎస్ తొలి జాబితాను తాజాగా మంత్రి ప్రకటించారు.
ఆ వివరాలు చూస్తే.4వ వార్డు కొండం కవిత, సంపత్ రెడ్డి.(జనరల్ మహిళ).8వ వార్డు వరాల కవిత, సురేష్.(బీసీ మహిళ).17వ వార్డు మాల్యాల జ్యోతి, ప్రశాంత్.31 వ వార్డు జంగిటి కనకరాజు (బీసీ జనరల్).34 వ వార్డు గుడాల సంధ్య, శ్రీకాంత్ (జనరల్ మహిళ).37వ వార్డు సాకి బాల్ లక్ష్మీ ఆనంద్ (ఎస్సీ మహిళ ) మొదలగు వీరిని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.ఇకపోతే ఈ నెల 18 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుండగా, ఉపసంహరణకు 22వ తేదీన తుది గడువుగా విధించారు.కాగా మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.