బిగ్ బాస్ సీజన్ ఫోర్ గురించి ఇంకా మర్చిపోకముందే బిగ్ బాస్ సీజన్ 5 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఇప్పుడప్పుడే సీజన్ 5 రాదని అందరూ భావించారు.
కానీ అన్ని సీజన్ల కంటే సీజన్ ఫైవ్ తొందరగా ప్రారంభం కాబోతోందని ఈ షో నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.బిగ్ బాస్ సీజన్ 1 2,3,4 లతో పోలిస్తే ఈ సీజన్ ముందుగా ప్రచారం కానున్నట్లు సమాచారం వినబడుతోంది.బిగ్ బాస్ సీజన్ 5 వచ్చే నెల మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రసారం కానుంది.ఇందులో భాగంగానే కంటెస్టెంట్ లను ఎంపిక చేయడం కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది.
అయితే గత సీజన్లలో మాదిరి కాకుండా సీజన్ ఫోర్ లాగేసోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిని కంటెస్టెంట్ గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడానికి దాదాపు 60 మంది పేర్లను ఎంపిక చేసినట్లు వారిలో కొందరికి ఫోన్లు కూడా వెళ్లినట్లు సమాచారం వినబడుతోంది.
గత బిగ్ బాస్ సీజన్ 3,4 లకు హోస్ట్ గా ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున వ్యవహరించారు.అయితే ఈసారి ప్రసారం కాబోయే సీజన్ ఫైవ్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.ఇక కంటెస్టెంట్ ల విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు ఎక్కువగా లవ్ ట్రాక్, లవ్ ఎఫైర్ రావటం వల్ల వారి షో కి ఎక్కువగా రేటింగ్స్ వస్తాయి.కాబట్టి అలాంటి వారి కోసం బిగ్ బాస్ ఏరికోరి కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపుతారు.
అయితే ఈసారి మాత్రం కంటెస్టెంట్ ల విషయంలో మరింత మసాలాను జోడించి ప్రముఖ కాంట్రవర్సీ యాంకర్ గా పేరు సంపాదించుకున్న కీర్తి రెడ్డి ని హౌస్ లోపలికి పంపించాలని బిగ్ బాస్ భావించినట్లు తెలుస్తోంది.కీర్తి రెడ్డి ఎంతో బోల్డ్ గా వ్యవహరిస్తూ, సోషల్ మీడియా వేదికగా ఎంతో రచ్చరచ్చ చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది.
ఇలాంటి కంటెస్టెంట్ లను హౌస్ లోపలికి పంపించడం వల్ల షో రేటింగ్స్ పెరుగుతాయని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.అయితే ఈ విషయం గురించి బిగ్ బాస్ నిర్వాహకులు కీర్తి రెడ్డిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.