తెలుగు టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ యాంకర్ గా తిరుగులేని ఇమేజ్ ని యాంకర్ సుమ సొంతం చేసుకుంది.ఎప్పుడో దశాబ్దం క్రితం యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సుమ తన మాటల గారడీతో ఇప్పటికి ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది.
చాలా షోలు కేవలం యాంకర్ సుమ కోసమే టీవీ ప్రేక్షకులు చూస్తారంటే అతిశయోక్తి కాదు.ప్రస్తుతం రియాలిటీషోలలోకి కొత్త కొత్త భామలు యాంకర్ లు గా ఎంట్రీ ఇచ్చి తమ హాట్ స్కిన్ షో తో గ్లామర్ తీసుకొచ్చారు.
ప్రేక్షకులు కూడా ఇలాంటి గ్లామర్ యాంకర్స్ ని చూడటానికి ఇష్టపడుతున్నారు.ఇలాంటి వాతావరణంలో కూడా కేవలం తమ మాటల చాతుర్యంతోనే అందరికంటే ఎక్కువ షోలు చేస్తూ యాంకర్ సుమ నెంబర్ వన్ యాంకర్ గా తన తిరుగులేని ప్రస్తానం కొనసాగిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఈ నేపధ్యంలో ఒటీటీ చానల్స్ కొత్త కొత్త కాన్సెప్ట్ తో షోలని డిజైన్ చేస్తున్నాయి.
ఇప్పటి వరకు టెలివిజన్ ని రూల్ చేసిన యాంకర్ సుమర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతుంది.అల్లు అరవింద్ ఆహా ఒటీటీలో సరికొత్త కాన్సెప్ట్ తో ఒక రియాలిటీ గేమ్ షోని ప్లాన్ చేశారు.
ఇవి కూడా ఎపిసోడ్స్ గానే రిలీజ్ అవుతాయి.ఈ షోలకి యాంకర్ గా సుమని తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ షోకి సంబంధించి ఈ రోజు ఐదు గంటలకి బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుంది.ఆహా పేస్ బుక్ పేజీ ద్వారా ఆమె లైవ్ లోకి వచ్చి షోగురించి చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.
మరి ఆమె ఒటీటీలో చేయబోయే షో ఎలా ఉండబోతుంది, ఎలాంటి కాన్సెప్ట్ తో ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.