ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది కేంద్ర ప్రభుత్వం.ఈ కారణంగా అన్ని రంగాలకు చెందిన పనులు మూతపడటంతో ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం.వారు తమ సొంతగూటికి చేరేందుకు కొన్ని వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్న దృశ్యాలు సభ్యసమాజాన్ని కదిలిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అనేకమంది వలస కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు.
అయితే వలస కార్మికులు తమ సొంత రాష్ట్రంలో అడుగుపెట్టగానే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వారిని క్వారంటైన్లో పెట్టిన తరువాతే ఇంటికి పంపేందుకు అధికారులు అనుమతిస్తున్నారు.అయితే ఈ క్రమంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వలస కార్మికులకు కండోమ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది.14 రోజులు క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారికి బీహార్ ప్రభుత్వం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.అవాంఛిత గర్భాలను అడ్డుకునేందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అటు బీహార్కు దాదాపు 9 లక్షలకు పైగా వలస కార్మికులు తిరిగి రావడంతో వారందరినీ క్వారంటైన్లో పెట్టామని, వారందరికీ కండోమ్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.మొత్తానికి వలస కార్మికుల శ్రేయస్సు కోసం ఇలాంటి ఆలోచనతో వార్తల్లోకెక్కిన బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు.