సోషల్ మీడియా సెన్షేషన్గా శ్రీరెడ్డిని చెప్పుకోవచ్చు.ఈమె సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు.
ఈ అమ్మడు ప్రస్తుతం తమిళనాడులో ఉంటుంది.అక్కడ ఉండి కూడా తెలుగు సినిమా పరిశ్రమ గురించి తెలుగు స్టార్స్ గురించి వ్యాఖ్యలు కామెంట్స్ చేస్తూనే ఉంది.
కొందరిని టార్గెట్ చేసి ఈమె చేస్తున్న వ్యాఖ్యలతో వారి జీవితాలే నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది.సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడే శ్రీరెడ్డిపై పోలీసు కేసు నమోదు అయిన విషయం తెల్సిందే.
కరాటే కళ్యాణి మరియు రాకేష్ మాస్టర్లు ఈమెపై అసభ్యంగా బూతులు మాట్లాడి అవమానించింది అంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ అమ్మడు చేసిన కామెంట్స్ను వీడియోల రూపంలో పోలీసులకు వారిద్దరు ఇవ్వడంతో ఆమెపై కేసు నమోదు చేశారు.ఏ క్షణంలో అయినా శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారని అంతా భావిస్తున్నారు.ఈ సమయంలో ఈ అమ్మడు రివర్స్గా వారిపై కూడా తమిళనాడులో కేసును పెట్టింది.
తనను అసభ్యంగా తిట్టారు అని, తాను అక్రమంగా సంపాదించి ఇల్లు, కారు కొనుగోలు చేశాను అంటూ వారు వ్యాఖ్యలు చేసి తన పరువు పోగొట్టారు అంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.తాను సినిమాల్లో నటిస్తూ ఉన్నాను.నా సంపాదనతో నేను కొనుగోలు చేసుకున్న వాటిపై కొందరు అసత్యపు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పుడు ఎంక్వౌరీ మొదలు పెట్టారు.త్వరలోనే కరాటే కళ్యాణి మరియు రాకేష్లను విచారించే అవకాశం ఉంది.
ఈ దెబ్బతో కరాటే కళ్యాణి మరియు రాకేష్లు కంగారు పడుతున్నట్లుగా తెలుస్తోంది.