తెలుగులోని ఈటీవీ ఛానల్ లో ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఎటువంటి జబర్దస్త్ షోలో కంటెస్టెంట్లు తమ కామెడీతో అలరిస్తుంటే యాంకర్ అనసూయ మాత్రం తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడు జీ తెలుగులో కూడా రెండు షోలు నిర్వహిస్తూ అటు జీతెలుగులోనూ ఇటు ఈటీవీలో పలు షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.
అయితే తాజాగా ఈ అమ్మడికి కాంపిటీషన్ గా అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టువంటి రాఖీ చిత్రంలో ఎన్టీఆర్ చెల్లెలిగా నటించి మెప్పించినటువంటి యాంకర్ మంజూష ను దింపుతున్న ట్లు సమాచారం.అంతేగాక తాజాగా యాంకర్ మంజూషా కూడా ఈ మధ్య తెలుగు బుల్లి తెరపై బాగానే అలరిస్తోంది.
అయితే ఈ మధ్య యాంకర్ అనసూయ వరుస సినిమా ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతోంది.అందువల్ల అనసూయ జబర్దస్త్ షో షూటింగ్ కి సరిగా హాజరు కావడంలేదని అందువల్ల జబర్దస్త్ షో నిర్వాహకులు ఆమెపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయమై ఆమెకు డైరెక్ట్ గా చెప్పలేక ఇన్ డైరెక్ట్ గా యాంకర్ మంజూషని హైపర్ ఆది స్కిట్ లో గెస్ట్ గా నటింపజేసి అనసూయకి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అనసూయ మెగా స్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాల్లో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తోంది.