ఇండియా శ్రీలంకల మద్య జరగాల్సిన టీ20 సిరీస్ మొదటి టీ20 మ్యాచ్ నిన్న వర్షం కారణంగా రద్దు అయ్యింది అంటూ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.కాని అసలు విషయం ఏంటీ అంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాలేదు.
స్టేడియం నిర్వాహకుల వల్ల బీసీసీ పెద్దల అనాలోచిత నిర్ణయాల వల్ల నిన్నటి మ్యాచ్ రద్దు అయ్యింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.నిన్నటి మ్యాచ్ గౌహతిలో జరగాల్సిన విషయం తెల్సిందే.
అక్కడ వచ్చింది చిన్న వర్షమే, అది కూడా గంటపాటే.అలా మరెక్కడైనా వస్తే వెంటనే గంట ఆలస్యంగా మ్యాచ్ స్టార్ట్ అయ్యేది.
కాని గౌహతిలో మాత్రం కాలేదు.
గౌహతి పిచ్ తడవకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోలేదు.
ఆ తర్వాత తడిచిన పిచ్ను రెడీ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ ఎక్యుప్మెంట్స్ ఉంటాయి.కాని గౌహతి స్టేడియం నిర్వాహకులు మాత్రం హెయిర్ డ్రయర్ వంటి మిషన్ మరియు డ్రస్లు ఐరెన్ చేసుకునే వంటి మెషన్లతో పిచ్ను ఆరబెట్టేందుకు ప్రయత్నించారు.
అది ఎంతకు ఆరకపోవడంతో మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది.ఇలాంటి స్టేడియంలో మ్యాచ్ను పెట్టినందుకు బీసీసీఐ వారిని మరియు ఇలాంటి నిర్వాహణ చేసిన స్టేడియం నిర్వాహకులను మీకు బుద్ది ఉందా అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు.