ఒక యువతి ఒక యువకుడి ని పెళ్లి చేసుకోవడం అనేది సహజం.కానీ ఒక యువతి మరో యువతిని పెళ్లిచేసుకోవడం విడ్డూరం.
విదేశాల్లో ఇలాంటి సంస్కృతీ ఉన్నప్పటికీ ఇండియా లో మాత్రం ఇంకా ఈ సంస్కృతీ కి ఎవరూ అలవాటు పడలేదు.కానీ యూపీ లోని వారణాసి లో ఒక యువతి మరో యువతి ని పెళ్లి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.
సుందర్ పూర్,కాన్పూర్ లకు చెందిన ఇద్దరు యువతులు రోహానియా ప్రాంతంలోని ఒక శివాలయానికి వచ్చి మరి వారిద్దరూ వివాహం చేసుకున్నారు.జీన్స్,టీ షర్ట్ వేసుకున్న ఇద్దరు యువతులు ఆటోలో రోహానియా ప్రాంతంలోని శివాలయానికి చేరుకున్నారు.
అనంతరం చాలా సేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్న వారిద్దరూ తరువాత తమ వద్ద ఉన్న స్కార్ప్స్ ని తలపై కప్పుకొని పూజారి వద్దకు వెళ్లి పెళ్లి చేయాలనీ కోరారు.అయితే తొలుత ఈ తతంగానికి పూజారి నిరాకరించినప్పటికీ అనంతరం అందుకు ఒప్పుకున్నారు.
దానితో వారి పెళ్లి తంతు కార్యక్రమం మొదలు పెట్టి పెళ్లి తంతులోని కార్యక్రమాలన్నింటినీ వధూవరుల మాదిరిగా పూర్తిచేశారు.ఒక యువతి మరో యువతికి మంగళసూత్రం కూడా కట్టింది.పూలమాలలు కూడా వేసుకున్నారు.పెళ్లి అనంతరం వారు పూజారికి దక్షిణ కూడా సమర్పించుకున్నారు.వీరి వివాహ తంతును చూసిన వారు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా లో షేర్ చేశారు.అంతే ఈ వీడియో ఇక నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.