నీను ఏపీకి వస్తున్నా.. వైసేపీ కోసం ప్రచారం చేస్తా! అసవుద్దీన్ ఒవైసీ ప్రకటన!

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేసారు.ఏపీలో తెలుగు దేశం పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ తరుపున ఏపీలో ప్రచారానికి త్వరలో రాబోతున్నా అని, దమ్ముంటే కాచుకోవాలని ఒవైసీ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

 Asaduddin Owaisi Hot Comments On Chandrababu Naidu-TeluguStop.com

తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్న తమని చాలా మంది విమర్శించారని, అయితే మా నిర్ణయంలో ఎంత కచ్చితంగా ఉంటుందో ఎన్నికల తర్వాత అందరికి అర్ధమైంది అని ఒవైసీ అన్నారు.

అలాగే త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో చంద్రబాబుకి వ్యతిరేకంగా, వైసీపీ పార్టీకి ముస్లిం వర్గాల నుంచి మద్దతు కూడగట్టే విధంగా ఆ పార్టీ కోసం ప్రచారం చేస్తా అని ఒవైసీ చెప్పుకొచ్చారు.

అలాగే పుల్వామా దాడిలో ఇంటలిజెన్స్ వైఫల్యం వుందని, ఇస్లాం పేరుతో జరిగే టెర్రరిస్ట్ దాడులకి తాము పూర్తిగా వ్యతిరేకంగా అని ఒవైసీ అన్నారు.అలాగే వింగ్ కమాండర్ అభినందన్ చూపించిన తెగువ భారతీయులందరికీ స్ఫూర్తి అని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube