ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే సినిమా టాక్ కు వస్తున్న వసూళ్లకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది.
వంద కోట్ల వసూళ్లను సాధిస్తుందని భావించిన ఈ సినిమా కనీసం పాతిక కోట్లను కూడా రాబట్ట లేక పోయింది.సినిమా మొత్తం బాలకృష్ణ అనుకున్నట్లుగా తీశాడని, సినిమాలో అసలు డ్రామా, ఎమోషన్ ఎలిమెంట్స్ లేవని, అసలు వివాదాలు లేనట్లుగా ఈ సినిమా తీసారంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
ఇలాంటి సమయంలో మహానాయకుడు సినిమా విషయంలో జాగ్రత్త పడాలని బాలకృష్ణ మరియు క్రిష్ లు భావిస్తున్నారు.సినిమా లో వివాదాస్పద వ్యాఖ్యలు ఉంటేనే సినిమా ఆగుతుందని భావిస్తున్నారు.అందుకే మహానుభావుడు సినిమాలో వద్దన్న వివాదాస్పద సీన్స్ ను పెట్టబోతున్నారు.నాదెండ్ల వివాదాస్పద ఎపిసోడ్ తో పాటు, లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ను కూడా మహానాయకుడు సినిమాలో పెట్టాలని నిర్ణయించుకున్నారట.
ముందుగా అనుకున్న ప్రకారం మహానాయకుడు సినిమాను వచ్చే నెల మొదటి వారంలోనే విడుదల చేయాలనుకున్నారు.కానీ సినిమా కోసం ఇప్పటికే తీసిన సీన్స్ ను మళ్ళీ తీయాలని భావిస్తున్న నేపథ్యంలో సినిమా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహానాయకుడు వేసవి తర్వాత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మహానాయకుడు సినిమాలో వివాదాలను చూపిస్తే కచ్చితంగా వసూళ్లు బాగా వచ్చే అవకాశం ఉంది.