తెలుగు మీడియాలో ఎన్ని దినపత్రికలు ఉన్నా, ఎన్ని టీవీ ఛానెల్స్ ఉన్నా టీవీ-9కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తెలుగు మీడియా రంగంలో టీవీ-9 ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువు అయ్యింది.
ఈ క్రేజీ ఛానెల్ను ఎప్పటి నుంచో అమ్మేస్తారని, రేటు కూడా కుదిరిందని చర్చలు నడుస్తోన్న సంగతి తెలిసిందే.అయితే యేడాదిగా ఈ ప్రదిపాదన ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉంది.
ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం టీవీ-9 అమ్మకానికి ప్రాథమిక చర్చలు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది.కేంద్రంలో ఎన్డీయే సర్కార్కు మద్దతుగా నిలుస్తోన్న రిపబ్లిక్ ఛానెల్ యాజమాన్యం టీవీ-9ను కొనుగోలు చేస్తోంది.వీరి మధ్య కుదిరిన ప్రాథమిక డీల్ ప్రకారం రూ.500 కోట్లకు ఈ డీల్ సెట్ అయినట్టు తెలుస్తోంది.టైమ్స్ నౌలో ఎంతో పాపులర్ అయిన అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో వాటాదారుగా ఉన్నారు.
ఇక రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా రిపబ్లిక్ టీవీలో వాటాదారుడిగా ఉన్నారు.
ఇక బీజేపీ ఇప్పటికే నార్త్లో పాగా వేసి సౌత్లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తోన్న తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా గ్రిప్ సాధించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
2019 ఎన్నికల్లో కుదిరితే సొంతంగా లేకపోతే.పొత్తు పెట్టుకుని సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది.
ఇక మోడీని, కేంద్రాన్ని రిపబ్లిక్ టీవీ ఎప్పుడూ భుజనా మోస్తోందన్న టాక్ ఉంది.ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని మోసేందుకు టీవీ-9 సాయంతో విజృంభించాలని చూస్తోంది.
మరి టీవీ-9 రిపబ్లిక్ ఛానెల్ చేతికి వెళ్లిపోతే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఓ బలమైన మీడియా చేతుల్లో ఉన్నట్టే.