యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోని సినిమాలలో శక్తి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా నిర్మాతలకు ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయి.
మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా గురించి మాట్లాడటానికి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్దగా ఇష్టపడరనే సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబర్ భువన్ కుమార్ టిటూ టాక్స్ ప్రోగ్రామ్ లో చరణ్, తారక్, రాజమౌళిని ఇంటర్వ్యూ చేశారు.
భువన్ కుమార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి సినిమా అంటే తనకు ఇష్టమని చెప్పగా ఎన్టీఆర్ తన సినిమాలలో శక్తి సినిమా తప్ప మరే సినిమాను చూడలేదా అంటూ రివర్స్ లో ప్రశ్నించారు.శక్తి సినిమాను మరిచిపోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ భువన్ కుమార్ ను వేడుకోవడం గమనార్హం.
ఎన్టీఆర్ జక్కన్నను మాన్ స్టర్ అని ఎందుకు పిలుస్తారో చెప్పాలని భువన్ కుమార్ అడగగా ఎన్టీఆర్ డెవిల్ అని
అందువల్లే అతనికి అవతలి వ్యక్తులు మాన్ స్టర్ లా కనిపిస్తారని జక్కన్న అన్నారు.ఆ తర్వాత భువన్ కుమార్ రాజమౌళిని కింగ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ ప్రశంసించారు.ఆ తర్వాత భువన్ కుమార్ బాహుబలి సినిమా వల్ల తనకు ఎదురైన ఇబ్బంది గురించి చెప్పుకొచ్చారు.
ప్రభాస్ బాహుబలిలో శివలింగం మోసినట్టు తన భార్య కూడా మూడో ఫ్లోర్ కు గ్యాస్ సిలిండర్ మోయాలని చెబుతోందని తన బాధను భువన్ కుమార్ వెల్లడించారు.లెగసీ వల్ల డిసిప్లీన్ వస్తుందని చరణ్ చెప్పగా ఫ్లాప్స్ వచ్చిన సమయంలో లెగసీ గొప్పదనం అర్థమైందని ఎన్టీఆర్ అన్నారు.చరణ్, ఎన్టీఆర్ ఈ షో ద్వారా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.