తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి( Chandrababu Naidu ) ఐటి శాఖ 46 పేజీల నోటీసులు పంపించడం తెలిసిందే.టీడీపీ హయాంలో కాంట్రాక్టుల నిధుల మళ్లింపుకు పాల్పడినట్లు ఐటీ శాఖ నోటీసులలో పేర్కొనడం జరిగింది.
దాదాపు 118 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు స్పష్టం చేయడం జరిగింది.చంద్రబాబుకి ఐటీ నోటీసులు పంపించడం పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకి ఐటి నోటీసులపై సంచలన పోస్ట్ పెట్టారు.
“చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు.‘ఏముంది.బోఫోర్స్ స్కాం( Bofors Scam ) కంటే పెద్దదా ఇది.కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం.2G స్కాం కేసు ఏమైంది.వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’ అని ఎదురు దాడికి దిగుతాడు.వేచి చూడండి” అని ట్వీట్ చేశారు.
దీంతో విజయసాయిరెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరోపక్క వైసీపీ నాయకులు ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.