నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
సెప్టెంబర్ తొలి వారంలో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమాపై మరోసారి హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి మరో టీజర్ లేదా ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.నాని నెగెటివ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇక నివేదా థామస్, అదితి రావు హైదరీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఎలాగైనా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూసిన చిత్ర యూనిట్, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు.మరి ‘వి’చిత్రం ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.