తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అంటూ ఉదయ్ నిధి సంచలన కామెంట్స్..!!

తమిళనాడు డీఎంకే మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్( Udayanidhi Stalin ) సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు.

 Uday Nidhi Sensational Comments Saying That His Comments Are Being Distorted Det-TeluguStop.com

హిందూ ధార్మిక సంస్థకు చెందిన వాళ్లు ఉదయ్ నిధి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీలో తమిళనాడు భవన్ నీ( Tamilnadu Bhawan ) బీజేపీ నాయకులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

సనాతన ధర్మాన్ని( Sanatana Dharm ) ‘దోమలు, డెంగీ, మలేరియా, జ్వరం, కరోనా’తో పోల్చడంపై మండిపడుతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఉదయ్ నిధి సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.

అంతేకాదు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.తాను కుల బేధాలు నశించాలని అన్నట్లు స్పష్టం చేశారు.కేవలం హిందుత్వంలోనే కాకుండా అన్ని మతాల్లోనూ ఈ బేధాలు పోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఇదే సందర్భంలో ఇండియా కూటమిని( India Alliance ) చూసి బీజేపీ ( BJP ) భయపడుతోందని ఉదయ్ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోపక్క ఇండియా కూటమికి చెందిన నాయకులు… సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయ్ నిధి చేసిన వ్యాఖ్యలకు కూటమికి సంబంధం లేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube