తమిళనాడు డీఎంకే మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్( Udayanidhi Stalin ) సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు.
హిందూ ధార్మిక సంస్థకు చెందిన వాళ్లు ఉదయ్ నిధి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీలో తమిళనాడు భవన్ నీ( Tamilnadu Bhawan ) బీజేపీ నాయకులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
సనాతన ధర్మాన్ని( Sanatana Dharm ) ‘దోమలు, డెంగీ, మలేరియా, జ్వరం, కరోనా’తో పోల్చడంపై మండిపడుతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఉదయ్ నిధి సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
అంతేకాదు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.తాను కుల బేధాలు నశించాలని అన్నట్లు స్పష్టం చేశారు.కేవలం హిందుత్వంలోనే కాకుండా అన్ని మతాల్లోనూ ఈ బేధాలు పోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఇదే సందర్భంలో ఇండియా కూటమిని( India Alliance ) చూసి బీజేపీ ( BJP ) భయపడుతోందని ఉదయ్ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోపక్క ఇండియా కూటమికి చెందిన నాయకులు… సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయ్ నిధి చేసిన వ్యాఖ్యలకు కూటమికి సంబంధం లేదని అంటున్నారు.