తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఈ మేరకు నగరంలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగానే హైదరాబాద్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనుంది.మరికాసేపటిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.
ఇందులో ప్రధానంగా నగరంలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనుంది.కాగా ఈనెల 16, 17 వ తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే 16న సీడబ్ల్యూసీ సభ్యులకే సమావేశం పరిమితం కాగా ఈనెల 17న సీడబ్ల్యూసీతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కూడా భేటీ కానున్నారు.అనంతరం అదే రోజు భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది.
ఈ సభా వేదికపై నుంచి టీపీసీసీ ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.