నేటి సోషల్ మీడియా యుగంలో, వైరల్ వీడియోలకు కొదవ లేకుండాపోతుంది.అనేక ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతునే ఉన్నాయి.
ఇక పెళ్లిళ్లలో వధూవరుల మధ్య జరిగే ఫన్నీ సంఘటనలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ లో వైరల్ గా మారింది.
వధువుకు ఇష్టం లేకపోయినా వరుడు రసగుల్లా తినిపించాలని ఒత్తిడి చేశాడు.దీంతో ఆమెకు కోపం వచ్చింది.
దాంతో చివరకు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
ఓ పెళ్లిలో జరిగిన ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ నెట్వర్క్ లలో తెగ వైరల్ గా మారింది.నూతన వధూవరులు ( Newlyweds )వేదికపై పూల దండలు మార్చుకుని అందరి సమక్షంలో స్వీట్లు తింటున్నారు.ముందుగా వధువు వరుడికి రసగుల్లా తినిపిస్తుంది.అప్పుడు రసగుల్లా తీసుకున్న వరుడు వధువుకు తినిపించే ప్రయత్నం చేస్తాడు.“నేను స్వీట్లు తినడానికి ఇష్టపడను” అంటూ వధువు వరుడితో చెప్పింది.అయితే, వరుడు వధువును బలవంతంగా రసగుల్లా తినిపించాడు.
వరుడు బలవంతంగా మిఠాయి తినిపించినప్పుడు( fed candy ) , వధువు అకస్మాత్తుగా కోపంగా తను పట్టుకున్న మిఠాయి ప్లేటును నేలపైకి విసిరి కొట్టి., వరుడిని తోసేసింది.ఈ మాటలతో అతను స్టేజ్ నుంచి కిందకి పడిపోతాడు.
అంతటితో ఆగకుండా కోపంతో వరుడిపైకి దూసుకెళ్లింది.“నాకు స్వీట్లు ఇష్టం లేదని చెబితే.
వాటికి తినిపిస్తావా.?” – అంటూ ఆమె వరుడిని తిడుతూ, అతనిని తన్నుతుంది.ఆమె వరుడిపై ఉమ్మివేసి అవమానించింది.అంతేకాకుండా పదే పదే వరుడిని తన్నుతుంది.బంధుమిత్రులు ఎంత సర్దిచెప్పినా వధువు శాంతించదు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై వివిధ స్టైల్స్ లో స్పందిస్తున్నారు.“అయ్యో.ఈ పెళ్ళికూతురి కోపం మామూలుగా లేదు అని కొందరు అంటుండగా., మరికొందరైతే ముందుముందు వరుడి పరిస్థితి అర్థం అవ్వట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.