ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం అడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏం జరగలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ తోపులాటకు దారితీసింది.
దీంతో అడ గ్రామంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలోనే గ్రామంలో ప్రచారం చేయకుండానే బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న వెనుదిరిగారు.