టాలీవుడ్ ఈ సంవత్సరం మంచి సక్సెస్ లను దక్కించుకుందనే చెప్పాలి.కొన్ని సూపర్ హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు నిరాశ పరచగా.
కొన్ని సినిమాలు అంచనా లేకుండా విడుదలై భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.అందులో ముఖ్యంగా సీతారామం, బింబిసార, కార్తికేయ 2.
ఈ మూడు సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద చేసిన సందడి అంతా ఎంత కాదు.మూడు సినిమాలు కూడా దాదాపుగా రూ.100 కోట్ల వసూలను సొంతం చేసుకున్నాయి.ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో కొత్త అర్థం ను చూపించాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూడు సినిమాలు థియేటర్లో విడుదలయ్యాయి.ఎక్కువ శాతం మంది థియేటర్ల లో చూసేశారు కానీ కొద్ది మంది మాత్రం ఇంకా సినిమా ను చూడకుండా ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.
ఈ మూడు సినిమాలు విడుదల తేదీలకు సంబంధించి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం లో దుల్కర్ సల్మాన్ మృనాల్ ఠాగూర్ నటించిన సీతారామం సినిమా సెప్టెంబర్ 9 తారీఖున అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.కానీ మిగిలిన రెండు సినిమాలు ఎప్పుడు అనే విషయమై క్లారిటీ లేదు.
ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన తర్వాత ఆ సినిమా లు ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఓటీటీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అందరి దృష్టి సీతారామం స్ట్రీమింగ్ పైనే ఉంది.
ఎప్పుడెప్పుడు 9వ తారీకు అవుతుందా సీతారామం ని చూద్దామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.మిగిలిన రెండు సినిమాలు కూడా త్వరగా స్ట్రీమింగ్ అయితే బాగుండు అని ఎక్కువ శాతం మంది కోరుకుంటున్నారు.
మరి వాటి యొక్క స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు వస్తుందో చూడాలి.