తెలంగాణాలో కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సిఎం కే.
సి.ఆర్ సోమవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు.కరోనా నియంత్రణలో భాగంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది.అయితే లాక్ డౌన్ టైం లో కేసులు తగ్గినట్టు తెలుస్తుంది.అయితే 10 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే.45 ఏళ్లు పై బడిన వారికి మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.ఫస్ట్ డోస్ తీసుకున్న వారు రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం 45 ఏళ్లు పై బడ్డ వారికే ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ఈ విషయాలపై సిఎం కే.సి.ఆర్ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఆరోగ్య శాఖతో చేసే సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
దీనితో పాటుగా రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ పై కూడా చర్చలు నిర్వహిస్తారని తెలుస్తుంది.కరోనా నుండి కోలుకున్న కే.సి.ఆర్ హైదరబాద్ గాంధీ హాస్పిటల్, వరంగల్ ఎం.జి.ఎం హాస్పిటల్స్ లో కరోనా పేషంట్స్ ను పరామర్శించారు.వైధ్యానికి సంబందించిన వివరాలను కూడా అడిగి తెలుస్కున్నారని తెలుస్తుంది.అంతేకాదు సిఎం సమీక్ష తర్వాత లాక్ డౌన్ పై కూడా తదుపరి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.