మదర్సాలు అని పిలిచే మతపరమైన పాఠశాలల్లో ఏ వయసులో ఉన్న బాలికలైన చదువుకోవచ్చునని, ఇది గతంలో అబ్బాయిలకు మాత్రమే పరిమితమైందని తాజాగా తాలిబన్ అధికారులు( Taliban officials ) ప్రకటించారు.ఇప్పుడు ఆడపిల్లలు ఆరవ తరగతికి మించి తమ విద్యను కొనసాగించవచ్చు.
తాలిబన్లు ఇంతకుముందు ఆడపిల్లలు ఆరుకు మించి చదవకూడదని బ్యాన్ విధించారు.యూఎన్ ప్రత్యేక ప్రతినిధి రోజా ఒటున్బయేవా బుధవారం మాట్లాడుతూ, మదర్సాలకు హాజరవుతున్న బాలికల గురించి యూఎన్ కొన్ని నివేదికలు విన్నదని, అయితే ఈ విద్య నాణ్యత, పరిధి గురించి తనకు చాలా ప్రశ్నలు ఉన్నాయని చెప్పారు.
మదర్సాలు( Madrassas ) ఎలాంటి పాఠ్యాంశాలను అనుసరించాయి, వాటిలో ఏవైనా ఆధునిక విషయాలను చేర్చినట్లయితే, ఎంత మంది అమ్మాయిలకు ప్రవేశం ఉంటుంది అని ఆమె సందేహాలను వ్యక్తం చేశారు.
యూనివర్శిటీతో సహా ఆరవ తరగతికి మించి బాలికల విద్యపై తాలిబన్లు గతంలో విధించిన నిషేధాన్ని అంతర్జాతీయంగా చాలామంది ఖండించారు, విమర్శించారు.ప్రపంచంలో మహిళలకు ఉన్నత విద్యను పొందే హక్కును నిరాకరిస్తున్న ఏకైక దేశం ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ).కాబూల్లోని విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి మన్సోర్ అహ్మద్ ( Mansoor Ahmed )అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మదర్సాలలో బాలికలు వారి వయస్సుకు తగిన తరగతిలో ఉన్నంత వరకు వారికి వయోపరిమితి లేదని చెప్పారు.వయసు పైబడిన బాలికలు లేదా మహిళలు చిన్న విద్యార్థులతో కింది తరగతుల్లో చేరలేకపోతున్నారని తెలిపారు.మసీదులు లేదా ఇళ్లలో నిర్వహించే ప్రైవేట్ మదర్సాలకు ఎలాంటి వయో పరిమితులు లేవని, ఏ వయసు ఆడవారినైనా అంగీకరించవచ్చని ఆయన తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 20,000 మదర్సాలు ఉన్నాయని, వాటిలో 13,500 ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని అహ్మద్ చెప్పారు.ఈ మదర్సాలలో ఎంతమంది బాలికలు చేరారు లేదా తాలిబన్ నిషేధం తర్వాత వారి సంఖ్య పెరిగిందా అనే దానిపై అతను ఎటువంటి సమాచారం అందించలేదు.మగ, ఆడ లింగాల కలయికను నిరోధించేందుకు యూనివర్శిటీ నిషేధం అవసరమని ఆయన పేర్కొన్నారు.కొన్ని సబ్జెక్టులు ఇస్లామిక్ సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని విశ్వసిస్తూ వాటిని కూడా బ్యాన్ చేశారు.
నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం లేదా తాలిబన్ నిబంధనలకు అనుగుణంగా విశ్వవిద్యాలయ వ్యవస్థలో ఏవైనా మార్పులు చేయాలనే దానిపై ఆయన స్పందించలేదు.