స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది.ఈ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది.కోర్టు నంబర్ 15లో 53 వ ఐటెంగా కేసు లిస్టు అయింది.
నవంబర్ 20న ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
చంద్రబాబు బెయిల్ మంజూరులో ఆధారాలను, తమ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.