యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej) హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆదికేశవ‘( Aadi Keshava ).ఉప్పెనతో ఒక్కసారిగా క్రేజ్ పెంచుకున్న వైష్ణవ్ ఆ తర్వాత అంతగా ప్రభావం చూపించలేక పోతున్నాడు.
మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకుని మెగా ఫ్యాన్స్ ను తన వైపుకు తిప్పుకున్నాడు.
అయితే ఆ తర్వాత ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేదు.కొండపొలం, రంగరంగ వైభవంగా వంటి రెండు సినిమాలతో వచ్చి ప్లాప్స్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తన 4వ సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమాపై వైష్ణవ్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు.
ఆదికేశవ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.ఇక ట్రైలర్ తో మాస్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసినట్టు అనిపిస్తుంది.
ఈ క్రమంలోనే ఆదికేశవ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.ఈ సినిమా కూడా ఈ ఏడాదిలో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి మాస్ చిత్రాల జాబితాలో చేరిపోతుందని అన్నారు.
ఈ సినిమాల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో మాస్ సినిమాలు రాలేదని.ఆ ప్లేస్ ను ఆదికేశవ భర్తీ చేస్తుందని అన్నారు.అంతేకాదు ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నవంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నట్టు తెలిపారు.ఇక ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
మరి శ్రీలీల, వైష్ణవ్ కెమిస్ట్రీ ఆద్యంతం ఎలా అలరిస్తుందో చూడాలి.కాగా జివి ప్రకాష్ ( GV Prakash ) సంగీతం ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.