కరోనా సమయములో అంతర్జాతీయ ఎయిర్ లైన్స్( International Airlines ) లు అనేక కష్టాలు పడటం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ లు అనేక నష్టాల్లో కూరుకుపోయాయి.
కరోనా కంట్రోల్ చేయటానికి వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాలు చూశాయి.ఒక దేశం నుండి మరొక దేశానికి విమాన రాకపోకలు ఆగిపోయిన పరిస్థితి అప్పట్లో నెలకొంది.
అయితే రెండు సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గడం తెలిసింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ( World Health Organization ) సైతం కరోనా ఎమర్జెన్సీ నీ పూర్తిగా ఎత్తివేయడం జరిగింది.
ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ లు నష్టాల్లో ఉండగా… సింగపూర్ ఎయిర్ లైన్స్( Singapore Airlines ) మాత్రం తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించడం జరిగింది.గడచిన ఏడాదిలో లాభాలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.దీంతో ఉద్యోగుల 8 నెలల జీతానికి సమానంగా ఈ బోనస్ ఇస్తామని తెలిపింది.కరోనా లాంటి కష్ట సమయంలో ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన కృషికి ఫలితంగా బోనస్ ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.