తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల మతి పోగొడుతూ.తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది రెజీనా కసాండ్రా తన కోర చూపుల తో ఎంతో మంది యువతను పగటి కల లోకి నెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎంతోమందిని అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది.ఒకవైపు గ్లామర్ పాత్రలో నటిస్తున్న మరోవైపు పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది ఈ చెన్నై పొన్ను.
కొత్త జంట,పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది రెజీనా.కానీ గత కొంత కాలం నుంచి మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులకు దూరమై దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
ఇక 2022 ఏడాదిలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది రెజీనా కసాండ్రా.ఇక రెజీనా నటించిన ఏ ఏ సినిమాలు 2022 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గుబాటి వారసుడు రానా హీరోగా తెరకెక్కిన సినిమా 1945.పిరియాడిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు మూడేళ్ల క్రితమే పూర్తయింది.కానీ ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు.ఇక ఈ సినిమాలో నటిస్తుంది రెజీనా .ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతుంది.మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ తో తన అందచందాలను ఆరబోసేందుకు తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టేందుకు సిద్ధమైంది.
ఈ సినిమా ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక నివేదాథామస్ తో కలిసి నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా శాకిని ఢాకిని సినిమా కూడా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో విడుదల కాబోతోంది.అంతేకాకుండా రెజీనా కసాండ్రా నటించిన నేనే నా అనే సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తంమీద చూసుకుంటే రెండేళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులకు దూరమైన రెజీనా కసాండ్రా ఇప్పుడు గ్యాప్ లేకుండా తెలుగు ప్రేక్షకులను 2022 సంవత్సరంలో అలరించేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.