బన్నీ తరువాత రష్మిక.. ఏం చేస్తుందంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కించేందుక చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా, ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

 Rashmika Mandanna, Puspha, Allu Arjun, Sukumar-TeluguStop.com

ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

పుష్ప అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది.ఇక ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్న బన్నీ పూర్తి చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోంది.ఈమె కూడా ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతుందట.

దీని కోసం సుకుమార్ రాసిచ్చిన చిత్తూరు యాస స్ర్కిప్టును ఆమె ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలో చాలా ఆసక్తిగా నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో అమ్మడు చిత్తూరు యాసలో ఎలా మాట్లాడుతుందో చూడాలి.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube