స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కించేందుక చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా, ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
పుష్ప అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతోంది.ఇక ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్న బన్నీ పూర్తి చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడు.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోంది.ఈమె కూడా ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతుందట.
దీని కోసం సుకుమార్ రాసిచ్చిన చిత్తూరు యాస స్ర్కిప్టును ఆమె ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో చాలా ఆసక్తిగా నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో అమ్మడు చిత్తూరు యాసలో ఎలా మాట్లాడుతుందో చూడాలి.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు.