తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి.ఈ మేరకు జారీ అయిన జీవో నెంబర్ 33పై స్టే విధించాలని సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలు అయ్యాయని సమాచారం.
ఆధార్ సొసైటీ, ఆదివాసీ ఉద్యోగుల అసోసియేషన్ తో పాటు ఆదిమ ఆదీవాసుల సంక్షేమ హక్కుల పరిరక్షణ సంఘాలు న్యాయస్థానంలో పిల్ లు వేశారు.ఈ జీవోతో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన బంజార, లంబాడ, సుగాలీలకు లబ్ధి చేకూరుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
అసలైన ఎస్టీలకు దీని ద్వారా నష్టం జరుగుతుందని వెల్లడించారు.కాగా ఈ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.