సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )అభ్యర్దిని ప్రకటించడంలో చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఇటికాల చిరంజీవి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ఈసందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐసిసి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అసహనానికి లోనైన తుంగతుర్తి నియోజకవర్గ కార్యకర్తల సలహా మేరకే నామినేషన్ వేస్తున్నట్టు తెలిపారు.గత ఎన్నికల్లో తుంగతుర్తి నుండి వడ్డేపల్లి రవి( Vaddepalli Ravi ) ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడంతో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇటికాల చిరంజీవి నామినేషన్ వేయడంతో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఈ కార్యక్రమానికి హాజరై, ర్యాలీలో పాల్గొని ఇటికాల చిరంజీవికి సంఘీభావం తెలిపడం గమనార్హం.