అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya ) ఒకరు.అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
వరుస సినిమాలతో దూసుకుపోతున్న చైతూకు ఈ మధ్య ప్లాప్స్ ఎదురవడంతో రేసులో వెనుకబడి ఉన్నాడు.ఈ క్రమంలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు.
నాగ చైతన్య వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాల హిట్స్ ఇచ్చిన చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి( Sai Pallavi ) మరోసారి నటిస్తుంది.
ఇప్పటికే ఈ జంట లవ్ స్టోరీ సినిమాతో( Love Story ) సూపర్ హిట్ అందుకుంది.
దీంతో ఈ హిట్ పెయిర్ మరోసారి జోడీ కట్టనుంది.ఇదిలా ఉండగా మొన్న చైతూ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.
ఈ సినిమాకు ‘తండేల్”( Thandel ) అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయగా ఇప్పుడు ఈ రోజు గ్రాండ్ గా ఈ సినిమాను లాంచ్ చేసారు.పెరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారు.ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్,( Venkatesh ) నాగార్జున( Nagarjuna ) అతిథులుగా వచ్చి ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న చందు మొండేటి నాగ చైతన్యకు కూడా హిట్ ఇచ్చి స్టార్ డైరెక్టర్ అయిపోవాలని చూస్తున్నాడు.టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై ఆడియెన్స్ అంచనాలు పెట్టుకున్నారు.చూడాలి ఈ కాంబో ఎలా ఆకట్టుకుంటుందో.