ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మేఘాలయ సీఎం సంగ్మా భేటీ..!!

మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె.సంగ్మా( Meghalaya CM Sangma ) గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ( CM KCR ) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

 Meghalaya Cm Sangma Met With Cm Kcr At Pragati Bhavan Details, Meghalaya Cm Sang-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రగతి భవన్ కి చేరుకున్న సీఎం సంగ్మాను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించడం జరిగింది.ఆ తర్వాత తేనేటి విందు ఆతిథ్యం ఇచ్చారు.

ఈ క్రమంలో కాసేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు విషయాలపై మాట్లాడుకోవడం జరిగింది.అనంతరం సీఎం కె.సంగ్మానీ శాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు కేసీఆర్.అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ ముఖ్యమంత్రికి కేసీఆర్…బీఆర్ఎస్ నేతలు( BRS ) వీడ్కోలు పలకడం జరిగింది.

ఇదే కార్యక్రమంలో.బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు మంత్రులు కేటీఆర్,( KTR ) హరీష్ రావు,( Harish Rao ) ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.హైదరాబాద్( Hyderabad ) పర్యటనకు వచ్చిన మేఘాలయ ముఖ్యమంత్రి. నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఈ క్రమంలో హైదరాబాద్ లోని టీ హబ్ ను( T-Hub ) సందర్శించడం జరిగింది.నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కావడం జరిగింది.

దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా రాణిస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube