మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె.సంగ్మా( Meghalaya CM Sangma ) గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ( CM KCR ) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రగతి భవన్ కి చేరుకున్న సీఎం సంగ్మాను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించడం జరిగింది.ఆ తర్వాత తేనేటి విందు ఆతిథ్యం ఇచ్చారు.
ఈ క్రమంలో కాసేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు విషయాలపై మాట్లాడుకోవడం జరిగింది.అనంతరం సీఎం కె.సంగ్మానీ శాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు కేసీఆర్.అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ ముఖ్యమంత్రికి కేసీఆర్…బీఆర్ఎస్ నేతలు( BRS ) వీడ్కోలు పలకడం జరిగింది.
ఇదే కార్యక్రమంలో.బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు మంత్రులు కేటీఆర్,( KTR ) హరీష్ రావు,( Harish Rao ) ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.హైదరాబాద్( Hyderabad ) పర్యటనకు వచ్చిన మేఘాలయ ముఖ్యమంత్రి. నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఈ క్రమంలో హైదరాబాద్ లోని టీ హబ్ ను( T-Hub ) సందర్శించడం జరిగింది.నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కావడం జరిగింది.
దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా రాణిస్తుందని స్పష్టం చేశారు.