ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని కాపురాన్ని బుగ్గి పాలు చేసుకుంటున్నారు.కాగా తాజాగా ఓ మహిళ తన కంటే వయసులో పెద్దవాడైన నా వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని తన ప్రియుడితో కలిసి భర్తని దారుణంగా హత మార్చిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే రమ్య (పేరు మార్చాం) అనే యువతి తన భర్త పిల్లలతో కలిసి స్థానిక రాష్ట్రంలోని “సేలం” పట్టణ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటోంది.కాగా రమ్య కి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి తో పెళ్లి చేశారు.
అయితే రమ్యకి అప్పటికే చాలా మంది వ్యక్తులతో అక్రమ సంబంధాలు ఉండేవి.దీంతో పెళ్లయిన తర్వాత కూడా రమ్య తన బాయ్ ఫ్రెండ్స్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.
అయితే ఈ మధ్య రమ్య నివాసం ఉంటున్న ఇంటికి ఇతర వ్యక్తులు వచ్చి వెళుతుండటంతో కొందరు స్థానికులు రమ్య భర్తకి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.దీంతో రమ్య ని నిలదీయడంతో అసలు విషయం బయట పడింది.
అయినప్పటికీ రమ్య భర్త మాత్రం మంచి మనసుతో జరిగిందేదో జరిగిపోయిందని కాబట్టి ఇకనైనా మంచిగా ఉండాలంటూ సూచించాడు.
అయినప్పటికీ రమ్య మాత్రం తన భర్త మాటలను పెడ చెవిన పెట్టింది.అంతేకాకుండా తన భర్త ఇంట్లో లేనప్పుడు బాయ్ ఫ్రెండ్ ని పిలిపించుకొని విచ్చల విడిగా ఎంజాయ్ చేసేది.దీంతో మరోమారు ఈ విషయంపై రమ్య కి మరియు తన భర్త కి గొడవ జరిగింది.
దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతని అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నింది.ఈ క్రమంలో తన భర్త రాత్రి పూట ఆదమరచి నిద్రపోతున్న సమయంలో తన ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించి దారుణంగా హత మార్చింది.
అనంతరం ఏమీ ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే పోలీసుల విచారణలో రమ్య ప్రవర్తనలో అనుమానం కలిగించడంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తన వివాహేతర సంబంధాలకి భర్త అడ్డుగా ఉన్నాడని తానే తన ప్రియుడితో కలిసి హతమార్చినట్లు అంగీకరించింది.
దీంతో ప్రస్తుతం రమ్య మరియు ఆమె ప్రియుడు కటకటాల్లో ఊచలు లెక్క పెడుతున్నారు.