బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )ఆరోపణలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy ) హత్యపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూ తగదాలు ఉన్నాయని మంత్రి జూపల్లి తెలిపారు.బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేస్తోందన్న మంత్రి జూపల్లి హంతకులు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు.
బీఆర్ఎస్( BRS ) నేతలకు తనను ప్రశ్నించే అర్హత లేదని పేర్కొన్నారు.ఎలాంటి రాజకీయ విలువలు లేని నేతలు బీఆర్ఎస్ లీడర్లు అని తెలిపారు.