సర్కారు వారి పాట దర్శకుడి పారితోషికం అంతేనా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమా అంటే వందల కోట్ల బిజినెస్‌.థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా డిజిటల్‌ శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా కనీసం 250 కోట్ల వరకు అయినా బిజినెస్‌ అవుతుంది.

 Mahesh Babu And Parushuram Combination Movie Sarkaru Vari Pata About Director Re-TeluguStop.com

మహేష్‌ తో సినిమా అంటే దర్శకుల పంట కూడా పండుతుందని అనుకుంటారు.కాని మహేష్‌ 27వ చిత్రం సర్కారు వారి పాట సినిమా దర్శకుడి పారితోషికం విషయంలో మాత్రం ఎక్కువ శాతం మంది పెదవి విరుస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంకు గాను దర్శకుడు అనీల్‌ రావిపూడి దాదాపుగా ఇరువై కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు పరశురామ్‌ మాత్రం కేవలం 10 కోట్ల పారితోషికంతోనే సినిమా చేస్తున్నాడట.

సినిమా సక్సెస్‌ అయితే లాభాల్లో వాటా ఉంటుందని ఒప్పందం చేసుకున్నారట.అయితే పారితోషికం విషయంలో అంత తక్కువ ఇవ్వడం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Telugu Anil Ravipudi, Mahesh Babu, Parushuram, Tollywood-Movie

మహేష్‌ బాబు తన ప్రతి సినిమాకు 50 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటాడు.ఈ సినిమాకు 75 కోట్లకు మించి పారితోషికంతో పాటు లాభాల్లో వాట తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అలాంటిది దర్శకుడు పరశురామ్‌కు మాత్రం కేవలం 10 కోట్లు ఇవ్వడం నిర్మాతలకు భావ్యమేనా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.ఈ చిత్రంను ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో పట్టాలు ఎక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సినిమా వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube