సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే వందల కోట్ల బిజినెస్.థియేట్రికల్ రైట్స్ ద్వారా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ద్వారా కనీసం 250 కోట్ల వరకు అయినా బిజినెస్ అవుతుంది.
మహేష్ తో సినిమా అంటే దర్శకుల పంట కూడా పండుతుందని అనుకుంటారు.కాని మహేష్ 27వ చిత్రం సర్కారు వారి పాట సినిమా దర్శకుడి పారితోషికం విషయంలో మాత్రం ఎక్కువ శాతం మంది పెదవి విరుస్తున్నారు.
సరిలేరు నీకెవ్వరు చిత్రంకు గాను దర్శకుడు అనీల్ రావిపూడి దాదాపుగా ఇరువై కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు పరశురామ్ మాత్రం కేవలం 10 కోట్ల పారితోషికంతోనే సినిమా చేస్తున్నాడట.
సినిమా సక్సెస్ అయితే లాభాల్లో వాటా ఉంటుందని ఒప్పందం చేసుకున్నారట.అయితే పారితోషికం విషయంలో అంత తక్కువ ఇవ్వడం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
మహేష్ బాబు తన ప్రతి సినిమాకు 50 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటాడు.ఈ సినిమాకు 75 కోట్లకు మించి పారితోషికంతో పాటు లాభాల్లో వాట తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అలాంటిది దర్శకుడు పరశురామ్కు మాత్రం కేవలం 10 కోట్లు ఇవ్వడం నిర్మాతలకు భావ్యమేనా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ చిత్రంను ఆగస్టు లేదా సెప్టెంబర్లో పట్టాలు ఎక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమా వచ్చే అవకాశం ఉంది.