ఏంటి నిజామా ? ఒక ఫోన్ నెంబర్ కు అన్ని కోట్లు ఎందుకు తగలేశారు అని మీకు అనిపించచ్చు.కానీ నిజంగానే ఒక ఫోన్ నెంబర్ కు 2 కోట్ల 23 లక్షల 54 వేల రూపాయిలు తాగలేశారు.
ఈ వింత ఘటన చైనాలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
చైనాలో ఒక ఫోన్ నెంబర్ ను ఆన్లైన్ లో వేలానికి పెట్టారు.
దీంతో ఆ ఫోన్ నెంబర్ ఏకంగా 2.25 మిలియన్ యువన్లకు కొనుగోలు చేశారు.అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 2 కోట్ల 24 లక్షల 54 వేల రూపాయిలు.
ఆ ఫోన్ నెంబర్ కు అంత పెట్టడానికి కారణం ఆ ఫోన్ నెంబర్ లోని చివరి ఐదు నెంబర్లు ”ఎనిమిది”నెంబర్ ను కలిగి ఉన్నాయి.మాండరిన్ భాషలో ఎనిమిది నెంబర్ను పలికితే ”శ్రేయస్సు” అని అర్ధం.
అందుకే చైనీయులు ఎనిమిది నెంబర్కు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు.ఎనిమిది నెంబర్ కు చైనాలో ఎంతో ప్రాధాన్యత ఉంది.
అక్కడ ఈ పని చెయ్యాలి అన్న 8 సంఖ్య కనీసం ఒక్కసారైనా వచ్చేలా చూసుకొని చేస్తారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఎనిమిది నెంబర్ కు ఏకంగా అంత ఖర్చు పెట్టారు.
ఇక మాండరిన్ భాషలో నాలుగు నెంబర్ అంటే చావు అని అర్ధం.అందుకే అక్కడ నాలుగు నెంబర్ కు చెడుగా భావిస్తారు.