కరోనా మళ్ళీ విజృంభిస్తుంది.కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో స్ట్రాంగ్ గా మన ముందుకు వచ్చింది.
రోజురోజుకూ కేసులు మరింత పెరుగు తున్నాయి.ఈసారి ఓమిక్రాన్ రూపంలో భారీ ముప్పు తప్పదని అందరికి అర్ధం అయ్యింది.
థర్డ్ వేవ్ కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతూ ప్రజల్లో మళ్ళీ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
మొదట్లో రోజుకి పదుల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు వందలు దాటి వేలు, లక్షలు అవుతున్నాయి.
ఇక సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే మన టాలీవుడ్ లో మహేష్ బాబు, విశ్వక్ సేన్, నితిన్ భార్య షాలిని, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
వీరందరూ ఆరోగ్యంగానే ఉన్నారు.అయితే తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు సత్య రాజ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఈయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సత్య రాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది.ఇటీవలే ఈయన కు కరోనా టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆయన గత కొన్ని రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు.
కానీ గత రాత్రి సత్య రాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది.అయితే ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం రాలేదు.
సత్య రాజ్ మన టాలీవుడ్ లో కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.బాహుబలి లో కట్టప్ప పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.ఆయన ను సత్య రాజ్ అనే కంటే కట్టప్ప అంటేనే గుర్తు పట్టే రేంజ్ లో ఈ పాత్రకు గుర్తింపు వచ్చింది.మరి ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అభిమానులకు సమాచారం చెబుతారో లేదో చూడాలి.