టాలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన మాస్టర్స్ సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా నిర్మాత జేవియర్ బ్రిట్టో ఆస్తులపై ఐటి అధికారులు తాజాగా తనిఖీ చేశారు.
దీనితో ఒక్కసారిగా అతను ఇబ్బందుల్లో పడ్డాడు.చైనా మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించి జేవియర్ కు బ్రిట్టో ఆదం బాక్కం చెందిన అడయార్ కార్యాలయంపై దాడులు జరుగుతున్నాయని సమాచారం.
బ్రిట్టో ఇల్లు, ఆఫీసులో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.ఈ క్రమంలోనే ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
చెన్నై, శ్రీ పెరంబదూరులోని పలు సెల్ఫోన్ సంస్థలపై మంగళవారం నుంచి ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.బుధవారం రోజున ఉదయం అడయార్ లోని జేవియర్ బ్రిట్టో నివాసం, అలాగే చెన్నై కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
సెల్ ఫోన్ సంస్థల్లో జరిపిన సోదాల్లో లభించిన సమాచారంతోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఐటి అధికారులు సోదాలు పొద్దు పోయేవరకు చేశారు.
కోలీవుడ్ హీరో విజయ్ బంధువు బ్రిట్టో మాస్టర్ సినిమాతో నిర్మాతగా మారారు.ఈయనకు పలు ట్రాన్స్ పోర్ట్ సంస్థలు కూడా ఉన్నాయి.
అంతే కాకుండా రాష్ట్రంలోని హార్బర్ ల ద్వారా అనేక దేశాలకు వివిధ ఉత్పత్తులు తరలిస్తున్నారు అని సమాచారం.బ్రిట్టో ఆస్తులకు సంబంధించి పలు అనుమానాలు రావడంతో ఆదాయపు పన్ను శాఖ అతని ఇంట్లో తనకి నిర్వహించింది.అందుకు గల ప్రధాన కారణం మొబైల్ కంపెనీ తో బ్రిట్టో పెట్టుకున్న సంబంధాలే అని తెలుస్తోంది.ఇకపోతే విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.