సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మణిరత్నం మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.
నిజానికి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీసిన దర్శకుల్లో మణిరత్నం( Mani Ratnam ) మొదటి స్థానంలో ఉంటాడు.ఆయన షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా వరుస సక్సెస్ లను కూడా అందుకున్నాడు.
ఇక తెలుగులో గీతాంజలి సినిమాతో నాగార్జున తో కూడా ఒక సినిమా చేసి సూపర్ హిట్ అందుకొని తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన బొంబాయి సినిమాలో మొదటగా నాగార్జున( Nagarjuna ) నే హీరోగా తీసుకొని చేద్దామని అనుకున్నారట, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలోకి అరవింద స్వామిని తీసుకోవాల్సి వచ్చింది అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి.నిజానికి ఆ సినిమా కొంచెం కాంట్రవర్సీతో కూడుకొని ఉంటుంది.కాబట్టి నాగార్జున కూడా అలాంటి సినిమా చేయడానికి ఇష్టపడలేదని అందువల్లే ఆ సినిమాను నాగార్జున వదిలేసుకోవాల్సి వచ్చిందంటు చాలా వార్తలు కూడా వచ్చాయి.
ఇక దాంతో అరవింద స్వామి( Arvind Swamy ) తో సినిమా చేసి మణిరత్నం సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఆ సినిమాతో మణిరత్నం క్రేజ్ పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయిందనే చెప్పాలి.అయితే సినిమా రిలీజ్ సమయంలో మణిరత్నం మీద కొన్ని అటాక్ లు కూడా జరిగినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.ఇంకా అంతకుమించి బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది.
కానీ వాటికి లొంగకుండా మణిరత్నం సినిమా చేసి రిలీజ్ చేసి సక్సెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు…
.